ఖైరతాబాద్ గణేశుడికి కరోనా దెబ్బ

ఖైరతాబాద్ గణేష్ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో మహిమ ఉంది. అలాంటి మహిమ గల గణనాథుడికి ఈసారి కరోనా దెబ్బ తగిలింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సారి ఒక్క అడుగు ఎత్తులో గణేశుడి విగ్రహం ఏర్పాటు చేయలని ఉత్సవ కమిటీ సంచల నిర్ణయం తీసుకుంది. గతేడాది ఖైరతాబాద్ వినాయకుడు ద్వాదశ మహాగణపతిగా 61 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శన మిచ్చాడు. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే గణేశుడు దర్శనం ఇవ్వనున్నాడు.