
దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచిన మహారాష్ట్రలో లాక్డౌన్ జూన్ 30 వరకూ పొడిగించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకూ అత్యవసర సర్వీసులు మినహా అన్నింటికీ కర్ఫ్యూ వర్తిస్తుంది.
అయితే, జూన్ 8వ తేదీ నుంచి ప్రైవేటు కార్యలయాలు 10శాతం ఉద్యోగులతో తమ కార్యాకలపాలు నిర్వహించుకోవచ్చు. మిగిలిన వారితో వర్క్ ఫ్రమ్ హోం చేయించుకోవాలి. రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య బస్సులు తిరుగుతాయి. అయితే, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదు.









