ఒడిశాలో కరోనా కలకలం రేపుతోంది..

కరోనా మహమ్మారి ఒడిశా లో ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. మొదట్లో దేశమంతటా కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒడిశాలో మాత్రం కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ గత వారం, పది రోజుల నుంచి మాత్రం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

శుక్రవారం కూడా కొత్తగా 65 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఉదయం 9 గంటల వరకు ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 737కు చేరింది. అయితే ఈ మొత్తం కేసులలో ఇప్పటికే 166 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు మృతి చెందారు. ఈ డిశ్చార్జిలు, మరణాలు పోను మిగతా 568 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖా తెలిపింది.