వెబ్‌సైట్‌లో టీటీడీ ఆస్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశమైంది ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్‌ కుమార్‌, భార్గవి, బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాలక మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి.. టీటీడీ ఆస్తులను వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. ఈ అంశమే టేబుల్‌ అజెండాగా సమావేశంలో ప్రతిపాదించారు. శేఖర్‌రెడ్డి ప్రతిపాదనకు టీటీడీ ఛైర్మన్‌ సానుకూలంగా స్పందించారు.