
కరోనా నివారణ చర్యల కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ.75 లక్షల విరాళం ఇచ్చింది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామమోహన్రావు చెక్కు అందజేశారు.
అంతేకాకుండా ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రూ.50 లక్షల విరాళమిచ్చింది. సీఎం జగన్కు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి చెక్కు అందించారు.









