ఎట్టకేలకు ప్రారంభమైన హరిహర వీరమల్లు

పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో సూర్య మూవీస్ బ్యానర్ ఫై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ మొదలు పెట్టి చాల రోజులే అవుతున్నప్పటికీ..ఇంకా పూర్తి కాలేదు. మధ్య లో కరోనా రావడం..అదే టైం లో పవన్ భీమ్లా నాయక్ స్టార్ట్ కావడం తో హరిహర వీరమల్లు ఆలా ఉండిపోయింది.

ప్రస్తుతం మిగిలి ఉన్న షూటింగ్ ను పూర్తి చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈరోజు షూటింగ్ మొదలైంది. ఈ నెల 8 నుంచి పవన్ షూట్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. “హరిహర వీర మల్లు” చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.