Site icon TeluguMirchi.com

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మూసివేత..


జీహెచ్ఎంసీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై చేపట్టనున్న పనుల దృష్ట్యా మూడు రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ నెల 6 వ తేదీ అర్ధరాత్రి నుండి 10 వ తేదీ ఉదయం 6 గంటల వరకు (03) రోజుల పాటు కేబుల్ బ్రిడ్జి మూసివేసి ట్రాఫిక్ మళ్లింపులను చేసారు. పనిని చేపట్టడానికి పైలాన్ P1 మరియు P2 సమీపంలో వంతెనపై 100 టన్నుల క్రేన్‌లను ఉంచాల్సిన అవసరం ఉన్నందున (03) రోజుల పాటు వంతెనను ట్రాఫిక్‌ ను మూసివేయాలని GHMC సైబరాబాద్ పోలీసులను కోరగా కేబుల్ బ్రిడ్జి పై రాకపోకలు నిలిపివేశారు.

Exit mobile version