Site icon TeluguMirchi.com

శబరిమల ఆలయ కానుకల విషయంలో హైకోర్టు జోక్యం


శబరిమల ఆలయానికి కానుకలుగా అందుతున్న నగదును లెక్కించడంలో లోపాలేమైనా ఉన్నాయా అనేది పరిశీలించి తనకు నివేదిక సమర్పించాలని కేరళ హైకోర్టు ట్రావెన్‌కోర్‌ బోర్డు నిఘా విభాగాన్ని ఆదేశించింది. నగదును సరిగ్గా లెక్కించకపోవడం వల్ల నోట్లు పాడైపోతున్నట్లు వ‌చ్చిన వార్త‌ల‌పై హైకోర్టు జోక్యం చేసుకుంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి భ‌క్తులు దాదాపు 310 కోట్ల రూపాయ‌ల న‌గ‌దును కానుకల రూపంలో సమర్పించారని ట్రావెన్‌కోర్‌ బోర్డు తెలిపింది.

Exit mobile version