Site icon TeluguMirchi.com

మద్యం మత్తులో సెల్ ఫోన్ కోసం స్నేహితుణ్ని చంపిన దుండగుడు

సెల్ ఫోన్ కోసం తలెత్తిన వివాదం చివరికి ఒకరి ప్రాణం తీసిన ఘటన జగద్గిరిగుట్ట పియస్ పరిధిలో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న శశి వైన్స్ వద్ద అర్దరాత్రి ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య జరిగింది. భూక్య భీమా(45) తన స్నేహితుడు ఇద్దరూ కలిసి శశి వైన్స్ వద్ద ఫుల్ గా మద్యం సేవించారు. తాగిన మత్తులో భూక్య భీమాకు ఇతని స్నేహితునికి మద్య సెల్ ఫోన్ కోసం గొడవ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి వైన్స్ షాపు సెక్యురిటీ గార్డ్ తెలిపాడు.

వైన్స్ మూసి వేసిన తదనంతరం సెక్యురిటీ గార్డ్ భోజనం చేయడానికి పక్కకు వెల్లగా ఒక పెద్ద బండరాయి శబ్దం రావడంతో తిరిగి వైన్స్ వద్దకు చేరుకొని చూడగా ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేయబడ్డాడని గమనించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్దలానికి చేరుకొని హత్య కాబడ్డ వ్యక్తి జేబులో ఉన్న బుక్ ను చెక్ చేయగా అతని పేరు భూక్య భీమా గా గుర్తించారు. అనంతరం మృత దేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్య చేసిన మృతుని స్నేహితుడి కోసం గాలిస్తున్నామని సిఐ సైదులు తెలిపాడు. సిసి ఫూటేజ్ కోసం ప్రయత్నిస్తున్నామని, అక్కడ ఉన్న కెమరాలలో ఈ ఘటన కవర్ కాలేదని సిఐ తెలిపాడు.

Exit mobile version