Site icon TeluguMirchi.com

ఒవైసీ గడ్డం కోసి కేసీఆర్ కు అతికిస్తారా ?


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ గడ్డంలేని ఒక ముల్లా అని… అసదుద్దీన్ ఒవైసీ గడ్డం కోసి కేసీఆర్ కు అతికిస్తానని అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్, ఎంఐఎంలకు లేదని చెప్పారు. కేవలం ముస్లింలకు మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. హిందువులు ఓట్లు వేయకుండానే టీఆర్ఎస్ 90 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుందా? అని నిలదీశారు.

ఎంఐఎంకు తొత్తుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అరవింద్ దుయ్యబట్టారు. సొంత తమ్ముడు అక్బరుద్దీన్ ను సొంత ఇలాకాలో కత్తులతో పొడిచి, తుపాకీతో కాలిస్తే… కాపాడుకోలేని వ్యక్తి అసదుద్దీన్ అని ఎద్దేవా చేశారు.

Exit mobile version