Site icon TeluguMirchi.com

తెలంగాణలో టీడీపీలోకి వలసలు

ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం సహజమే. టికెట్ దొరక్కపోతే.. టికెట్ ఇచ్చే పార్టీలో దూకేస్తారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇలాటి దూకుడులు ఎక్కువయ్యాయి. టీ-టీడీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా, మెదక్ జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ టీడీపీలో చేరనున్నారు. ఈనెల 19న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.

నందీశ్వర్ గౌడ్ 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన 2014లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి, అక్కడ ఇమడలేకపోయారు. నందీశ్వర్ గౌడ్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆ పార్టీలోకి వెళ్లిన టికెట్ ఖరారు అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో.. చివరకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మహాకూటమిలో భాగంగా పటాన్ చెరు టికెట్ టీడీపీకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version