Site icon TeluguMirchi.com

ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన పీఎం మోడీ

దేశవ్యాప్తంగా బహుళ అనుసంధానం లక్ష్యంగా ‘ప్రధానమంత్రి గతిశక్తి’ కార్యక్రమాన్ని పీఎం మోడీ ప్రగతి మైదానంలో నేడు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ ప్రణాళిక ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకంలో ముఖ్యమైన భాగమని అన్నారు. ఈ ప్రాజెక్టు కింద రూ. వంద లక్షల కోట్ల విలువైన ప్రణాళిక రూపొందించనట్లు తెలిపారు. 1.5 ట్రిలియన్ డాలర్ల జాతీయ మౌళిక సదుపాయలకు సంబంధించి ప్రాజెక్టులకు మరింత శక్తిని అందించనుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం చూపిందని అన్నారు. దేశంలో లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడం, సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే ‘ప్రధాన మంత్రి గతిశక్తి’ లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Exit mobile version