Site icon TeluguMirchi.com

బీజేపీకి షాక్ ఇచ్చిన ఆరెస్సెస్ చీఫ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ బీజేపీకి షాక్ ఇచ్చారు. ఆయన ఎప్పుడూ లేనిది తొలిసారి కాంగ్రెస్ గొప్పదనాన్ని కొనియడారు. ‘భావి భారతం-ఆర్ఎస్‌ఎస్ దృష్టికోణం’పై ఆర్ఎస్ఎస్ మూడురోజుల లెక్చర్ సిరీస్‌ సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. “దాదాపు 80 నిమిషాలపాటు ప్రసంగించిన మోహన్ భగవత్ ఆరెస్సెస్ సేవలు నిరుపమానమని అన్నారు. ఆరెస్సెస్ తమ సిద్ధాంతాలను ఎప్పుడూ ఏ ఒక్కరిపైనా బలవంతంగా రుద్దదని స్పష్టం చేశారు. అదే సమయంలో స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ నిరుపమాన సేవలు అందించిందని కొనియాడారు. ఎందరో గొప్ప నేతలను దేశానికి అందించిందని పేర్కొన్నారు. ఆరెస్సెస్ చీఫ్ కాంగ్రెస్‌ను ప్రస్తుతించడం ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version