Site icon TeluguMirchi.com

అర్ధరాత్రి మహిళలకు ప్రత్యేక రవాణా సదుపాయం !


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మెట్రో, బస్సులు నడవని సమయంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు మహిళలకు ఆటోలు ఏర్పాటు చేయాలని ఓ మహిళ, మంత్రి కేటీర్ కు ట్వీట్ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ, మహిళలకు రాత్రి సమయంలో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ల నుండి పోలీసుల ఆధ్వర్యంలో నడిచే ఆటోలు ఏర్పాటు చేయాలని డీజీపీ అంజనీ కుమార్ కు సూచించారు. దీనిపై డీజీపీ అంజనీకుమార్ స్పందిస్తూ మహిళలు సురక్షిత ప్రయాణం చేసేలా తగిన రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

Exit mobile version