Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడ్డ స్మృతి ఇరానీ

కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యముగా సినీ, రాజకీయనేతలు ఎక్కువ సంఖ్యలో పడుతుండడం కార్య కర్తల్లో , అభిమానుల్లో కలవరపెడుతుంది. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.

‘‘ఓ ప్రకటన చేసే క్రమంలో పదాల కోసం వెతకడం నాకు చాలా అరుదు. అందుకే నేను చాలా సరళంగా చెబుతున్నా. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

Exit mobile version