Site icon TeluguMirchi.com

ఒక్కరోజే 25 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ


తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం 25 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు, అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2020లో దీన్ని 60 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు విధుల్లో కొనసాగుతూ వచ్చిన నగరాభివృద్ధి, పంచాయతీ రాజ్,విద్య,వైద్య తదితర విభాగాల్లో పనిచేస్తున్నవారు రెండేళ్ల పాటుగా విధుల్లో కొనసాగారు. వీరందరి పదవీ కాలం మే 31తో ముగిసింది. దీంతో ఈ ఒకే రోజున రికార్డు స్థాయిలో 25వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు.

Exit mobile version