Site icon TeluguMirchi.com

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘కారుదే’ హవా…

TS-MLC-Resultsఎమ్మెల్సీ ఎన్నికల్లోను తెరాస తమ సత్తాను చాటుకుంది..నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేశారు.. మొత్తం 12 స్థానాలకు గానూ.. కరీంనగర్‌లో రెండు, వరంగల్, ఆదిలాబాద్ నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఒకటి చొప్పున ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలైన.. ఖమ్మం, నల్లగొండలో ఒక్కో ఎమ్మెల్సీస్థానానికి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీఆర్‌ఎస్ నాలుగు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైంది. టీడీపీ అడ్రస్ గల్లంతైంది.

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లాలో శంభీపూర్ రాజు, పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి విజయం సాధించారు.

Exit mobile version