Site icon TeluguMirchi.com

విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం


తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం.. పలుచోట్ల వరద పరిస్థితులు ఉండటంతో మరో మూడురోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాతావరణశాఖ, విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపి అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version