Site icon TeluguMirchi.com

తెలంగాణ లో 3 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు, కొత్తగా 3187 కేసులు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3,187 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,27,278 కేసులు నమోదు కాగా, ఇందులో 3,05,335 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 20,184 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో 7 గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,759కి చేరింది. తెలంగాణ లో ఈ రోజు 787 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు. ఈ రోజు GHMC పరిధిలో లో 551 , మేడ్చల్ మల్కాజ్గిరి లో 333, రంగారెడ్డి లో 271 లలో అత్యధికంగా కేసులు బయటపడ్డాయి.

Exit mobile version