Site icon TeluguMirchi.com

కేసీఆర్ ఫాంహౌస్’లో జగన్

ys jagan

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్’లో వైసీపీ అధినేత జగన్ ని చూడబోతున్నాం. ఈ మధ్య కేసీఆర్, జగన్ ల మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. జగన్ కూడా కేంద్రంలో కేసీఆర్ తీసుకురానున్న ఫెడరల్ ఫ్రెంట్ కి మద్దతునిచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, జగన్ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగినట్టు కనబడుతోంది.

త్వరలోనే విజయవాడ వెళ్లనున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లోకి జగన్‌ను ఆహ్వానించనున్నట్టు జగన్-కేటీఆర్ భేటీ అనంతరం కేటీఆర్ తెలిపారు. కాగా, కేసీఆర్ త్వరలో నిర్వహించనున్న సహస్ర చండీయాగానికి జగన్‌ను కేటీఆర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి 25 వరకు తన ఫాం హౌస్‌లో కేసీఆర్ నిర్వహించనున్న సహస్ర చండీయాగానికి జగన్‌ హాజరుకాబోతున్నట్టు సమాచారమ్. ఇదే జరిగితే.. కేసీఆర్ ఫాంహౌస్’లో జగన్ చూడొచ్చు.

గతంలో కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు చంద్రబాబుకు ఆహ్వానం అందలేదని సమాచారమ్.

Exit mobile version