వలస పక్షులతో రాహుల్ మాటామంతి

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కలిశారు. దిల్లీలోని సుఖ్‌దేవ్‌ విహార్‌ ఫ్లైఓవర్‌ వద్ద వారిని కలిసి ఇబ్బందులను తెలుసుకున్నారు.

ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడిన రాహుల్‌.. భారత్‌ నిర్మాణంలో వలస కూలీల పాత్రే కీలకమని.. తీవ్ర అవస్థలు పడుతున్న వీరికి దేశ ప్రజంలా అండగా నిలబడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.