
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. దిల్లీలోని సుఖ్దేవ్ విహార్ ఫ్లైఓవర్ వద్ద వారిని కలిసి ఇబ్బందులను తెలుసుకున్నారు.
ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన రాహుల్.. భారత్ నిర్మాణంలో వలస కూలీల పాత్రే కీలకమని.. తీవ్ర అవస్థలు పడుతున్న వీరికి దేశ ప్రజంలా అండగా నిలబడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.









