పవన్ ని ఫాలో అవుతున్న బన్నీ

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో `అల వైకుంఠ‌పుర‌ములో` తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ్రీ‌కాకుళం ఏరియాల్లో బాగా పాపుల‌ర్ అయిన ఓ జాన‌ప‌ద గీతాన్ని వాడుకుంటున్నారు. ఈ పాట‌ని త‌మ‌న్ త‌న‌దైన స్టైల్‌లో స్వ‌ర‌ప‌రిచాడ‌ని తెలుస్తోంది.

అయితే ఈ పాట ఆల్బ‌మ్‌లో ఉండ‌దు. సినిమాలో మాత్ర‌మే క‌నిపిస్తుంది, వినిపిస్తుంని తెలిసిందే. ఈనెల 14న పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేస్తారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి కూడా జాన‌ప‌ద గీతాలంటే చాలా ఇష్టం. త‌మ్ముడు, ఖుషి, జానీ సినిమాల్లో జాన‌ప‌ద గీతాల్ని వినిపించారు. అవి మాస్‌కి మాంఛి చిక్ ఇచ్చాయి. ఇప్పుడు బన్నీ కూడా ఇదే ఫాలో అవుతున్నాడన్నమాట.