వంశీ తో ఇప్పుడు కూడా లేదట..

క‌మ‌ర్షియ‌ల్‌, ప్రేమానురాగాలు, మ‌ల్టీస్టార‌ర్స్, భావోద్వేగాలతో కూడిన చిత్రాలు రూపొందించి ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న వంశీ పైడిప‌ల్లి ..మహేష్ తో మహర్షి చిత్రం చేసి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ వంశీ తోనే అని ప్రకటించారు కానీ చివరి నిమిషంలో మిస్ అయ్యింది.

వంశీ ని కాదని అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరూ చిత్రం చేసాడు. ఈ సినిమా తర్వాత వంశీ అనుకున్నారు. కానీ మహేష్ మాత్రం రాజమౌళి తో ఓకే చెప్పి అభిమానుల్లో ఆనందం నింపారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా ఆలస్యం అవుతుందనే నేపథ్యంలో వంశీ తో సినిమా చేస్తాడు కావొచ్చు అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా వంశీ కి నో చూపినట్లు తెలుస్తుంది. మరి ఇందుకు గల అసలు కారణం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది