సుశాంత్ కేసు ఫై నగ్మ సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆత్మ హత్య కోణం లో విచారణ మొదలు పెడితే అది కాస్త డ్రగ్స్ వ్యవహారం గా మారింది. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు పలువురి నుంచి కీలక విషయాలు రాబట్టారు. అయితే ఈ కేసు పట్ల సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ స్పందించారు. సుశాంత్ కేసును పక్కదోవ పట్టించేందుకే డ్రగ్స్ కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఎన్​సీబీ, ఈడీ, సీబీఐ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో జయప్రద గారికి చెప్పండి. ఈ కేసు విషయంలో వివరాల కోసం అందరం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. ఈ కేసును పక్కదోవ పట్టించడానికి అకస్మాత్తుగా బీజేపీ నేతలు డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతున్నారు. దేశమంతా ప్రస్తుతం సుశాంత్​కు న్యాయం జరగాలని కోరుకుంటుంది.” అని నగ్మ పేర్కొన్నారు.