పూరికి కొత్త తలనొప్పి

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య తర్వాత ఇండస్ట్రీ లో నెపోటిజ‌మ్ పై తీవ్ర దుమారం చెలరేగుతుంది. అభిమానులు , సినీ ప్రముఖులు సైతం దీనిపై చర్చ జరుపుతుండడం తో ..యాంటీ నెపోటిజ‌మ్ గ్యాంగ్ బీటౌన్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తోపాటు అనన్య‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పూరి కి తలనొప్పిగా మారింది.

పూరీ డైరెక్షన్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న చిత్రంలో అనన్య న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో క‌ర‌ణ్ జోహార్ కూడా అసోసియేట్ అవుతున్నాడు. యాంటీ నెపోటిజ‌మ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్న ఈ ఇద్ద‌రు సెల‌బ్రిటీల‌తో క‌లిసి ప‌ని చేస్తున్న పూరీ తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు.