బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు వినిపిస్తుండడం తో అంత నిజమే కావొచ్చని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కేసును సిబిఐ కి అప్పగించింది.
రంగంలోకి దిగిన సిబిఐ కేసును క్షణ్ణంగా పరిశీలిస్తూ సంచలన విషయాలు బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్పుత్ మృతి కేసులో ఈరోజు సీబీఐ విచారణకు రియా చక్రవర్తి హాజరైంది. ముంబైలోని డీఆర్డీవో గెస్ట్ హౌజ్లో సీబీఐ బృందం రెండు గంటలకు పైగా విచారించింది. ఈ విచారణలో ఆమెను అడిగిన ప్రశ్నలు ఇవే..
- సుశాంత్ మరణం గురించి రియాకు ఎవరు సమాచారం ఇచ్చారు? అప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది?
- సుశాంత్ మరణం గురించి తెలిసిన వెంటనే బాంద్రకు రియా వెళ్లిందా లేదా? వెళ్లకపోతే ఎందుకు వెళ్లలేదు? సుశాంత్ మృతదేహాన్ని ఎప్పుడు చూసింది?
- జూన్ 8 సుశాంత్ ఇంటి నుంచి రియా ఎందుకు వెళ్లిపోయింది?
- ఇంటి నుంచి వెళ్లిపోవడం ముందు సుశాంత్ తో ఏదైనా గొడవ జరిగిందా?
- సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిన తర్వాత జూన్ 9 నుంచి 14 మధ్య అతడితో రియా మాట్లాడిందా? అయితే దేని గురించి? కాకపోతే ఎందుకు?
- ఆ నాలుగు రోజుల్లో రియాతో మాట్లాడేందుకు సుశాంత్ ప్రయత్నించాడా? అతడి ఫోన్ కాల్స్ను ఆమెను పట్టించుకోలేదా? అయితే ఎందుకు? సుశాంత్ ఫోన్ నంబర్ ఎందుకు బ్లాక్ చేసింది?
- రియా కుటుంబ సభ్యులను కలిసేందుకు సుశాంత్ ప్రయత్నించాడా? దాని గురించి రియాకు తెలిసిన సమాచారం ఏమిటి?
- సుశాంత్ అనారోగ్యం, అతడి చికిత్సకు సంబంధించిన వివరాలు? వైద్యం అందించిన డాక్టర్లు, వాడిన మందుల వివరాలు?
- సుశాంత్ కుటుంబ సభ్యులతో రియాకు ఎలాంటి సంబంధాలున్నాయి?
- సీబీఐ దర్యాప్తును రియా ఎందుకు కోరింది? సుశాంత్ మరణం వెనక ఏదో ఉన్నదని ఆమె అనుమానిస్తున్నదా?