సుశాంత్‌-సారాల గురించి సంచలన విషయాలు తెలిపిన స‌బీర్ అహ్మ‌ద్..

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు గట్టిగా ప్రచారం కావడం తో ఈ కేసును సిబిఐ కి అప్పగించింది సుప్రీం కోర్ట్. ప్రస్తుతం సిబిఐ బృందం సుశాంత్ సన్నిహితులను విచారిస్తున్నారు. ఇందులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.

రీసెంట్ గా సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్..సారా అలీ ఖాన్‌తో సుశాంత్‌ ప్రేమాయ‌ణంకి సంబంధించి కొన్ని విష‌యాలు తెలుపాగా.. తాజాగా సుశాంత్ మాజీ అసిస్టెంట్ స‌బీర్ అహ్మ‌ద్.. బ్యాంకాక్ టూర్ గురించి, అక్క‌డ సుశాంత్‌-సారా క‌లిసి ల‌గ్జరీ హోట‌ల్‌లో ఉన్న విష‌యాల గురించి చెప్పుకొచ్చాడు.

సుశాంత్‌తో క‌లిసి కుశాల్ జావేరి, సిద్ధార్థ్ గుప్తా, అబ్బాస్, ముష్తాక్, సబీర్ అహ్మద్ బ్యాంకాక్ టూర్ వెళ్లారు. ఆ స‌మ‌యంలో సారా కూడా త‌మ‌తో ఉంద‌ని, అంతా క‌లిసి ఒక ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించామ‌ని స‌బీర్ పేర్కొన్నారు. అయితే సుశాంత్‌, సారా బ్యాంకాక్‌లోని విలాసవంతమైన హోటల్‌లో బస చేయ‌గా, వారు తొలి రోజే బీచ్‌ని సంద‌ర్శించారు. టూర్ మ‌ధ్య‌లోనే ర‌ద్ధు కాబ‌డింద‌ని, అందుకు కార‌ణం సునామి హెచ్చ‌రిక‌ల‌ని స‌బీర్ స్ప‌ష్టం చేశాడు. అయితే ఆ స‌మ‌యంలో విమాన టిక్కెట్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో నేను ముష్తాక్ నెల పాటు అక్క‌డే ఉన్నాం. ఖ‌ర్చుల‌కి సుశాంత్ త‌న కార్డ్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు.