బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు గట్టిగా ప్రచారం కావడం తో ఈ కేసును సిబిఐ కి అప్పగించింది సుప్రీం కోర్ట్. ప్రస్తుతం సిబిఐ బృందం దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటె సుశాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో పలు సినిమాలు రూపొందుతున్నాయి. ఇప్పటికే ‘సూసైడ్ ఆర్ మర్డర్? ఏ స్టార్ వాజ్ లాస్ట్’ పేరుతో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా, దీనికి షమీక్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ‘శశాంక్’ అనే చిత్రం తెరకెక్కనున్నట్టు అఫీషియల్ ప్రకటన చేశారు. మంచి భవిష్యత్ ఉన్న హీరో మృతి చెందడం, సినిమి ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఆర్య బబ్బర్, రాజ్వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. పాట్నా, లక్నో, ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.