రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొనగా..తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్, నటి తేజస్వి మడివాడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మూడు మొక్కలు నాటిన తేజస్వి.. ఈ ఛాలెంజ్ని కొనసాగించాలంటూ కావలి గ్రీష్మ ప్రసాద్ని కోరింది. ఇంత గొప్ప కార్యక్రమంలో తనని భాగస్వాములు చేసినందుకు సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపింది.