ఏపీ కరోనా ఉదృతి: 8,835 కేసులు , 64 మంది మృతి

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు వేలకొలది కొత్త కేసులు, పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 64 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,92,760 కు చేరుకోగా, 5,105 మంది మరణించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

#COVIDUpdates: 16/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,89,865 పాజిటివ్ కేసు లకు గాను
*4,94,481 మంది డిశ్చార్జ్ కాగా
*5,105 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 90,279#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/bRdSUEzE4x— ArogyaAndhra (@ArogyaAndhra) September 16, 2020