వైకాపా ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . ఇలాంటి సంక్షోభంలో అందరినీ కలుపుకొని వెళ్లాలనే ఆలోచన వైకాపా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం, భరోసా ఇవ్వడమే ముఖ్యమన్నారు.
వ్యక్తిగత వ్యవహారంలా కక్ష సాధింపు వైఖరితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులు, కూలీలు, కార్మికులు, పేదల కష్టాలపై దృష్టి సారిద్దామని పార్టీ నేతలకు పవన్ పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక విమర్శలతో ప్రజలపక్షాన మాట్లాడుదామన్నారు.









