కరోనా ఎఫెక్ట్ : రోడ్ల ఫై కనిపిస్తే అంబులెన్స్ ఎక్కిస్తున్నారు ..

దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో పోలీస్ లు లాక్ డౌన్ ను పటిష్టం గా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ఆకతాయిలు దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా మాస్క్ లు ధరించకుండా రోడ్ల పైకి వస్తున్నారు.

మొన్నటి వరకు పోలీసులు లాఠీలకు పనిచెపుతు ఆకతాయిల అట కట్టించాలని చేసినప్పటికీ వారు ఏ మాత్రం మారడం లేదు. దీంతో ఇకప్పుడు సరికొత్తగా చేస్తున్నారు. ఎవరైతే రోడ్ల పైకి వస్తున్నారో వారిని అంబులెన్స్ కు ఎక్కిస్తూ హాస్పటల్స్ కు తరిలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే హీరో మంచు విష్ణు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ వీడియో చూసిన వారంతా ఇలాగే చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.