
చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి షాక్ తాగింది. సీజన్ మొత్తం తడబడుతూనే వస్తున్న ఈ మాజీ చాంపియన్ ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. నిన్నటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘ ఆటలో ప్రతిరోజు మనది కాదు. ఓటమి చాలా కారణాలు వున్నాయి. అన్నిటిని సమీక్షించుకుంటాం. మిగిలిన లీగ్ దశలో మిగిలిన మ్యాచుల్లో కుర్రాళ్లకే అవకాశం ఇస్తాం. ఇకపై వాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వేచ్ఛగా ఆడుకోవచ్చు’ అని చెప్పుకొచ్చారు.
కాగా ఈ ఓటమితో ధోని ఫ్యాన్స్ చతికిలపడ్డారు. చాలా నిరాశలో మునిగిపోయారు. ఐపీఎల్లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్ చేసిన అరుదైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఇలా ఆడటం ఫ్యాన్స్ కి మింగుడుపడటం లేదు.









