
టీమిండియా ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా విసిరిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులు మాత్రమే చేసింది.
టీమిండియా ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 90 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 76 బంతులాడిన పాండ్య 7 ఫోర్లు, 4 సిక్సులతో అలరించాడు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో విరుచుకుపడిన స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు 3 వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 29న సిడ్నీలోనే జరగనుంది.









