అత్యంత వేగంగా కరోనా టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్

దేశవ్యాప్తంగా 47 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా టీకాలు వేశారు. బుధవారం మొత్తంగా 2,48,662 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో మొత్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు దాటింది. ఇప్పటిదాకా కరోనా టీకాల కోసం 92,61,227 మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది నమోదు చేసుకున్నారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

అయితే, అత్యంత వేగంగా నాలుగు మిలియన్ల (40 లక్షల) మందికి టీకాలు వేసిన దేశంగా భారత్ నిలిచింది. కేవలం 18 రోజుల్లోనే ఆ మార్క్ ను దాటి ప్రథమ స్థానంలో నిలిచింది. మంగళవారం (ఫిబ్రవరి 2) నాటికే భారత్ ఆ ఫీట్ ను సాధించింది. ఈ జాబితాలో అమెరికా రెండో స్థానాన్ని సాధించింది. ఆ దేశం 20 రోజుల్లో 40 లక్షల మందికి కరోనా టీకాలు వేసింది. బ్రిటన్, ఇజ్రాయెల్ లకు 39 రోజుల సమయం పట్టింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల