Odiyan The Age Of Illusion: మలయాళ ఇండస్ట్రీలోకి కరణ్ జోహార్ భారీ ఎంట్రీ.. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్!

Odiyan

Odiyan The Age Of Illusion: మలయాళ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఒక లాండ్ మార్క్ లాంటి కాంబినేషన్ సెట్ అయ్యింది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ, కరణ్ జోహార్‌కు చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ ఫస్ట్ టైం మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హోమ్ బ్యానర్ ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్’ విలక్షణ దర్శకుడు రాహుల్ సదాశివన్ (భ్రమయుగం ఫేమ్) కలయికలో ‘ఒడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ (#OdiyanTheAgeOfIllusion) అనే పీరియడ్ మైథలాజికల్ డ్రామాను అధికారికంగా ప్రకటించారు.

కేరళ సంస్కృతిలోని అత్యంత పురాతనమైన జానపద కథలు, మంత్రతంత్రాలు, క్షుద్రశక్తుల (Odiyan Folklore) నేపథ్యంతో కూడిన ఒక పురాణ గాథను ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. గతంలో ఇదే ఒడియన్ కాన్సెప్ట్‌తో మోహన్ లాల్ సినిమా వచ్చినప్పటికీ.. ఈసారి సరికొత్త విజన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో, ‘ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ అనే సబ్‌టైటిల్‌తో మరింత భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ అద్భుతమైన ఎపిక్ డ్రామాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్ మంజు వారియర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘భూతకాలం’, ‘భ్రమయుగం’ వంటి సినిమాలతో ప్రేక్షకులను హారర్, మిస్టరీ జోనర్‌లో కట్టిపడేసిన డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బాలీవుడ్, మాలీవుడ్‌కి చెందిన ముగ్గురు క్రియేటివ్ పవర్‌హౌస్‌లు కలిసి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తోందో చూడాలి.