Manasa Varanasi: శర్వానంద్‌ ‘జార్జ్ క్రిష్‌’లో మానస వారణాసి? హీరోయిన్‌గా దాదాపు ఖరారైనట్టే!

Manasa Varanasi

Manasa Varanasi: టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘జార్జ్ క్రిష్‌’ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా మానస వారణాసి నటించనున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా ఆమె పేరు దాదాపు ఖరారైనట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘జార్జ్ క్రిష్‌’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. శర్వానంద్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మానస వారణాసి హీరోయిన్‌గా ఎంపికైతే.. శర్వానంద్‌తో ఆమెకు ఇదే తొలి సినిమా కానుంది.

ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభించారు. లాంచ్‌ రోజునే సినిమాకు సంబంధించిన పలు కీలక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైనట్లు మేకర్స్ వెల్లడించారు. నైజాం, వైజాగ్‌, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్‌తో పాటు ఓవర్సీస్‌ హక్కులకు మంచి డిమాండ్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక ‘జార్జ్ క్రిష్‌’ను 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. హీరోయిన్‌ ఎంపిక, బిజినెస్‌ పరంగా వస్తున్న అప్‌డేట్స్‌ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మానస వారణాసి ఎంపికపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.