
ముంబయి జట్టు కొన్నేళ్ల పాటు ఇదే ఆటగాళ్లతో కొనసాగితే భవిష్యత్లోనూ ఓడించడం కష్టమని చెన్నై మాజీ బ్యాట్స్మన్ షేన్వాట్సన్ అభిప్రాయపడ్డాడు. తాజాగా దిల్లీని ఓడించిన ముంబయి 13వ సీజన్లోనూ విజేతగా నిలిచి ఐదోసారి కప్పు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టును అభినందిస్తూ మాట్లాడాడు. ఈ సీజన్లో రోహిత్ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, ఆ జట్టును వేలెత్తి చూపడానికి ఏమీ లేదని , ఈ సీజన్లో ఆడినన్ని రోజులూ ఆ జట్టు మెరుగవుతూనే ఉందన్నాడు.
కాగా, ఈ ఏడాది చెన్నై తరఫున చివరిసారి బరిలోకి దిగిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ మొత్తం 11 మ్యాచ్ల్లో 299 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. ఇక ఈ టీ20 లీగ్ మొత్తంలో 145 మ్యాచ్లు ఆడగా 3,874 పరుగులు చేశాడు. అందులో నాలుగు శతకాలు, 21 అర్ధశతకాలు ఉన్నాయి.









