
పంజాబ్లోని లుధియానాలో కరోనా వైరస్ ఓ ఏసీపీ ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ మహమ్మారి బారిన ఏసీపీ అనిల్ కోహ్లీ మృత్యువాతపడ్డారు. కొవిడ్ 19 సోకడంతో ఎస్పీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్టు డీపీఆర్వో కార్యాలయం వెల్లడించింది. పంజాబ్లో ఇప్పటివరకు 200లకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.
కాగా దేశంలో గత 24గంటల్లో 991 కరోనా పాజిటివ్ కేసులు; 43 మరణాలు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడినవారిలో 1992 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ సంయుక్త కమిషనర్ లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్లోని కరోనా బాధితుల్లో మరణాలు 3.3శాతం మాత్రమేనన్నారు.









