రైతుబంధు ఎక్కడ? కాంగ్రెస్ మాట తప్పిందంటూ హరీష్ రావు ఫైర్..

Harish Rao
మాజీ మంత్రి T. Harish Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల కన్నీళ్లపై పునాదులు వేసుకున్న ఏ ప్రభుత్వమూ చరిత్రలో నిలవలేదని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి Revanth Reddy ఇప్పుడు రైతుబంధు నిధుల విషయంలో మాట తప్పారని ఆరోపించారు. మిర్యాలగూడ సభలో ఎన్నికల అనంతరం రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామని చెప్పినా, ఇప్పటికీ అమలు కాలేదని గుర్తుచేశారు.

Also Read :  బస్తీ బాట పట్టిన కిషన్ రెడ్డి.. ప్రజలతో ముఖాముఖి!

ఎన్నికల ముందు ఎకరానికి ₹15,000 ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధు నిలిపివేశారని హరీష్ రావు ఆరోపించారు. ఒకవైపు మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయిస్తూనే రైతులకు నిధులు లేవని చెప్పడం విచిత్రమన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఖండిస్తూ, వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.