మే 3న సుహాస్ ‘ప్రసన్నవదనం’


యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. టీజర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం మంచి అంచనాలతో విడుదల కాబోతుంది.

ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.చంద్రశేఖరన్ డీవోపీ గా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.