నవదీప్ కి ఐస్ క్రీమ్ తినిపిస్తాడు

rgv
హిట్టు ఫ్లాపులు పక్కన పెడితే… దర్శకుడు వర్మ మాత్రం తన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. ఏప్రిల్ లో రౌడీని విడుదల చేసిన వర్మ.. ప్రస్తుతం మంచు విష్ణు సినిమా, రాజశేఖర్ పట్టపగలు చిత్రాలను రిలీజ్ చేయడానికి రెడీ వుంచాడు. ఈ లోపే మరో చచిత్రాన్ని ప్రకటించేశాడు. ఈ సినిమా పేరు ‘ఐస్ క్రీమ్’. నవదీప్ ఇందులో హీరోగా నటిస్తుండగా… తేజస్వి కథానాయికగా ఎంపికైంది. ఇటీవల వచ్చిన ‘మనం’ సినిమాలో సమంతా స్నేహితురాలి పాత్రలో కనిపించిన అమ్మాయే తేజస్వి.ఈ చిత్రాన్ని కేవలం మూడు నెలల్లో పూర్తి చేస్తానని వర్మ చెబుతున్నాడు. రొమాంటిక్ ఫిలింగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.