విశాఖ రైల్వే జోన్’కు లైన్ క్లియర్

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై కసరత్తు పూర్తయ్యిందని కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని దీనిపై ఏర్పాటైన కమిటీలు నివేదికలు అందించాయి. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ సాధ్యంకానీ పనేనని వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి సుజనా.. ఇప్పటికినీ రైల్వే జోన్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కొద్ది రోజులు ఆయన అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా, రైల్వే జోన్ అంశంపై కసరత్తు పూర్తయ్యిందని సుజన తెలపడంతో.. విశాఖ రైల్వే జోన్ కు లైన్ క్లియర్ అయినట్టేనని భావిస్తున్నారు.

ఇదీగాక, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణకు సవరణ అవసరం. సవరణ చేయడానికి రాజకీయ నిర్ణయం తీసుకోనున్నాం. ఈఏపీల విషయంలో నాబార్డు నుంచి నిధుల విడుదలకు రంగం సిద్దమైంది. బడ్జెట్ అయిన వెంటనే నిధులు విడుదలవుతాయని మంత్రి సుజనా తెలిపారు.