లోక సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. ముంబయి సహా దేశంలోని 71 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ మొదలయ్యింది. ‘రంగీలా’ భామ ఊర్మిళా మతోండ్కర్, సంజయ్దత్ సోదరి ప్రియాదత్, పూనమ్ మహాజన్, మిలింద్ దేవ్రా తదితరులు ముంబయిలోని వివిధ నియోజకవర్గాల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మొత్తం 8 రాష్ట్రాల్లోని 71 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్రలోని – 17, రాజస్థాన్ – 13, యూపీ – 13, పశ్చిమబెంగాల్లో – 8, మధ్యప్రదేశ్ – 6, ఒడిశా – 6, బీహార్ – 5, జార్ఖండ్ – 3 నియోజకవర్గాలతోపాటు జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ నియోజకవర్గంలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది.