ఓటు హక్కు ను వినియోగించుకున్న రజినీకాంత్..

దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ గురువారం మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు..వారి కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయమే సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రజనీ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకోగానే ఆయన్ని చూడడానికి అభిమానులంతా ఎగబడ్డారు. రజనీ పోలింగ్‌ కేంద్రంలోకి అడుగుపెట్టగానే అక్కడి అధికారులు లేచి నిలబడ్డారు.

అలాగే కాంగ్రెస్‌ నేత చిదంబరం భార్య నలిని చిదంబరం, కుమారుడు కార్తి చిదంబరం ఆయన భార్య శ్రీనిధి రంగరాజన్‌ కారైకుడిలోని శివగంగలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ బెంగళూరులోని జయానగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుశీల్‌కుమార్‌ షిండే మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.