సినీ నటుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి రవికిషన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలోని గోరేగావ్లో పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి బీజేపీ తరఫున రవి కిషన్ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
రవికిషన్ సినిమాల విషయానికి వస్తే ..రేసుగుర్రం సినిమాతో తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రవికిషన్ కు దక్కాయి. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో నటిస్తున్నాడు.