బీజీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు పరువు పోయింది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతుండగా… ఓ వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. అనూహ్య ఘటనతో జీవీఎల్ నిర్ఘాంతపోయారు. వెంటనే చెప్పు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
భోపాల్ అభ్యర్థిగా భాజపా తరఫున ప్రజ్ఞాసింగ్ను ప్రకటించిన అనంతరం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు జీవీఎల్ గురువారం ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కాన్పూర్కు చెందిన వైద్యుడు శక్తి భార్గవ్ జీవీఎల్పైకి చెప్పు విసిరాడు. ఇలాంటి దాడులకు తాను భయపడబోనని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లే ఇలాంటి దాడులు చేస్తారని ఆరోపించారు.