షాక్…కమల్ ఫై చెప్పుల దాడి

వెండితెర ఫై లోకనాయకుడు గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన కమల్ హాసన్ ..ప్రస్తుతం మ‌క్క‌ల్ నీది మయ్య‌మ్ అధినేతగా బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల ప్రచారం లో భాగంగా స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని తెలిపి హిందూ మనోభావాలను దెబ్బ తీసాడు. దీంతో క‌మ‌ల్‌పై స‌ర్వ‌త్రా నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లు సంఘాలు డిమాండ్ చేశాయి.

బుధ‌వారం రోజు క‌మ‌ల్ మ‌ధురైలోని తిరుప్ప‌ర‌కుంద్రం రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతున్న స‌మ‌యంలో 11 మంది వ్య‌క్తులు క‌మ‌ల్‌పై చెప్పులు వేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కమల్‌ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 11 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిలో భాజపా నేతలు, హనుమాన్‌ సేన సభ్యులు కూడా ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.