పవన్ ముందే గుండు వ్యవహారం తేల్చిన పరిటాల సునీత…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దివంగత టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే రవి సతీమణి పరిటాల సునీత ఈ గుండు వ్యవహారం ఫై క్లారిటీ ఇవ్వగా, మరోసారి ఈ వ్యవహారం ఫై సునీత నోరు విప్పింది..అది కూడా పవన్ కళ్యాణ్ ముందే.

అనంతపురం టూర్ లో ఉన్న జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈరోజు పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. ఓ గంట సేపు వారితో మాట్లాడి , అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌కు తన భర్త పరిటాల రవి గుండుకొట్టించారని వచ్చిన వార్తలపై సునీత స్పందించారు. తాము కూడా పేపర్లు, టీవీల్లో చూడటం, అక్కడా ఇక్కడ జనం మాట్లాడుకుంటే వినడం తప్ప తన భర్త ఎవరికీ గుండు కొట్టించలేదని సనీత స్పష్టం చేశారు. అసలు పరిటాల రవి గుండు కొట్టించే వ్యక్తి కాదని అన్నారు. ప్రతి ఒక్కరినీ ఆయన ప్రోత్సహించే వ్యక్తేగానీ ఎవర్నీ ఇబ్బంది పెట్టరని చెప్పారు. తన భర్తను పవన్ ఎప్పుడూ చూడలేదని, ఎవరో ఏదో అనుకుంటున్నారని తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సునీత తేల్చి చెప్పారు.