కదిరి నరసింహస్వామి దర్శించుకొన్న పవన్

అనంతపురం జిల్లా కదిరి పర్యటనలో ఉన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదిరి నరసింహస్వామిని దర్శించుకొన్నారు. పవన్’కు లయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. కదిరి నరసింహస్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించిన పవన్ తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

అనంతలో రెండో రోజు పవన్ పర్యటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఉదయం మంత్రి పరిటాల ఇంటికి వెళ్లిన పవన్.. ఆ తర్వాత కదిరిలో పర్యటించారు. సాయంత్రానికి కదిరి నరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు వచ్చారు.